గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య!

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాద‌య్య కాంగ్రెస్ పార్టీలో చేర‌డంపై నిర‌స‌న వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ అధికారంలో వుండ‌డంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాద‌య్య ఆ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌మ‌పై కేసులు పెట్టించి వేధించార‌ని…

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాద‌య్య కాంగ్రెస్ పార్టీలో చేర‌డంపై నిర‌స‌న వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ అధికారంలో వుండ‌డంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాద‌య్య ఆ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌మ‌పై కేసులు పెట్టించి వేధించార‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఎక్క‌డుంద‌ని గ‌తంలో ప్ర‌శ్నించిన యాద‌య్య‌… ఇప్పుడు అదే పార్టీలోకి ఎలా వ‌చ్చార‌నేది కార్య‌క‌ర్త‌ల ప్ర‌శ్న‌. గో బ్యాక్ యాద‌య్య అంటూ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు నిన‌దిస్తున్నారు.

కాంగ్రెస్‌లో యాద‌య్య చేరిక‌ను నిర‌సిస్తూ వికారాబాద్ జిల్లా మండ‌ల కేంద్ర‌మైన న‌వాబుపేట్‌లో అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు నిరాహార దీక్ష చేప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. యాద‌య్య చేరిక‌తో త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు వాపోయారు. కాంగ్రెస్ ఉనికినే ప్ర‌శ్నించిన యాద‌య్య‌, ఇప్పుడా పార్టీలో చేర‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు.

కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్‌ను విలీనం చేయాల‌నే వ్యూహంతో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్పీడ్ పెంచారు. త‌న ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తామ‌ని కేసీఆర్ హెచ్చ‌రించ‌డం వ‌ల్లే, ఫిరాయింపుల‌కు తెర‌లేపామ‌ని రేవంత్‌రెడ్డి చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే ఐదారుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.

ఫిరాయించిన వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని మ‌రోవైపు బీఆర్ఎస్ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసింది. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి ఫ‌లితం క‌నిపించ‌లేదు. గ‌తంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకుంది. అందుకే ప్ర‌శ్నించే నైతిక హ‌క్కును బీఆర్ఎస్ కోల్పోయింది.

5 Replies to “గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య!”

  1. K-batch దోపిడీ మొదలు

    పుణ్యం పురుషార్డం. ఇలాంటివి ఎన్నో చుటబోతున్నం వచ్చే 5 ఏళ్లలో… భారత్ బీజేపీ అంబానీ అడానిలకు కట్ట బెట్టినట్లు, ఇప్పటివరకు రాష్ట్రం లో 65% ఆస్తులు ఒక సామాజిక వర్గానికి కట్ట బెడితే, వచ్చే 5 ఏళ్లలో ఈ 65% నీ 80% తీసుకెళితే, జీవితం లో టీడీపీ నే ప్రభుత్వం వస్తూనే వుంటుంది..ఎందుకంటే కార్పొరేట్ మరియు రాష్ట్ర ఆస్తులు మొత్తం వాళ్ళ చేతిలో వుంటాయి… ఇదే జరిగితే, మిగతా 90% మంది ఓ 5% వర్గానికి బానిసల గా మారి పోతారు… ఇది ప్రజలకు అర్దం అయ్యే లోపల అసెట్లు అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్లి పోతాయి… అప్పుడు వాళ్లకు వోటోసి న ప్రతి వాడికి అర్దం అయిన వాడి జీవితం బానిసత్వం మాత్రమే…

  2. టీడీపీ అరాచకాలు మొదలయ్యాయి

    * వైజాగ్ గాంధీ హాస్పిటల్ ని HCG గ్రూప్ కి 714 కోట్లకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం*

    వైజాగ్ లో ఉన్న 196 బెడ్ ల మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ ని 414 కోట్లకి 54% షేర్ ని HCG గ్రూప్ సంస్థకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ నూతన కూటమి ప్రభుత్వం 

    మరో 34% షేర్ ని రాబోయే 18 నెలల కాలం లో అదే HCG గ్రూప్ కి 300 కోట్ల కి అమ్మకానికి ఒప్పందం 

    గమనిక: ఈ హాస్పిటల్ 2024 సంవంత్సరం లో ఆదాయం 162.4 కోట్లు 

    ఇంత ఆదాయం ఉన్న హాస్పటల్ ని కేవలం 714 కోట్లకి ప్రైవేట్ సంస్థకి అమ్మేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది 

    గత ప్రభుత్వం లో కొత్తగా హాస్పిటల్ లు మెడికల్ కాలేజీ లు – పలాస లో కిడ్నీ రెసర్చ్ సెంటర్ మరియు కిడ్నీ కేర్ హాస్పిటల్ కడితే- నూతన కూటమి ప్రభుత్వం హాస్పిటల్ లు అమ్మేయడం విడ్డురాం గా ఉంది 

    ఇక వైజాగ్ వాసులు- ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉచిత వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతుంది- దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి ( దీనిని ప్రశ్నించడానికి ప్రతిపక్షం లేకపోవడం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కి కలిసివస్తుంది)

    సోర్స్: ఎకనామిక్స్ టైమ్స్ అఫ్ ఇండియా

  3. విజనరీ బాబు

     ప్రతి మంగళవారం అప్పు 

    అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు 

    (జూన్ 12 న బాబు ప్రమాన శ్వీకారం చేశారు 

    జూన్ 25 న (మంగళవారం) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో

     2 వేల కోట్లు అప్పు చేసిన బాబు ప్రభుత్వం 

    జులై 2 (మంగళవారం ) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో 

    5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం 

    అంటే 20 రోజుల్లో 7 వేల కోట్ల అప్పు 

    ఆ విధంగా సంపద సృష్టిలో తలమునకలై ఉన్న విజనరీ బాబు )

  4.  మొదటి వెన్నుపోటు వాలంటీర్లకు. sorry 2024 lo లో మెదటి వెన్నుపోటు.1995 లో మామకు

    బాబు మొదటి దెబ్బకే అబ్బా అంటే ఎలా. 

     క్రిందవి అన్ని మోసం చేసినా తరువాతా చెప్పు ఎంత నొప్పు చెప్పు 

    TDP 2024 మెనెఫెస్టో

    మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

Comments are closed.